AP: అకాల వర్షం వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లడం బాధాకరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో పర్యటించిన ఆయన, ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.