NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఇవాళ జ్యోతి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా బీసీ ఇందిరమ్మ చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలను ఇచ్చారు.