PDPL: మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్డ్యాం గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలతో పూర్తిగా కప్పుకుపోయింది. ఇరువైపులా భారీగా పెరగడంతో నిల్వ నీరు తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. గుర్రపుడెక్క అధికంగా నీటిని పీల్చుకోవడంతో సాగునీటి సరఫరా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం మొక్కలను తొలగించి చెక్డ్యాం పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.