MBNR: నవాబ్పేట్ మండల కేంద్రంలోని బాలాజీ మార్కెట్ యార్డ్కు 1998 క్వింటాళ్ల వేరుశనగ వచ్చినట్లు కార్యదర్శి రమేష్ తెలిపారు. వేరుశనగ క్వింటాల్ గరిష్ట ధర ₹8,010 పలకగా, కనిష్టంగా ₹7,590 పలికింది. అయితే, చింతపండు గరిష్టంగా ₹9,890 ధర పలకడం విశేషం. వేరుశనగతో పోలిస్తే చింతపండుకే అధిక ధర రావడంతో రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.