PLD: మాచవరం మండలంలో మిర్చి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది ‘ఎర్ర బంగారం’ కాసుల వర్షం కురిపిస్తోంది. నిన్నటి వరకు రూ.15వేల లోపు ఉన్న క్వింటాల్ ధర ఒక్కసారిగా రూ. 20 వేల మార్కును దాటడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ. 2 లక్షల వరకు లాభాలు వస్తుండటంతో, కల్లాల్లో ఆరబోసిన పంటకు రైతులు కంటికి రెప్పలా కాపలా ఉంటున్నారు.