WGL: జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు 2 నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసినప్పటికీ చెల్లింపులు ఆలస్యం కావడంతో అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కూలీలు కోరారు.