ELR: జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారును పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.