గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలో ఆదివారం ఈత కోసం వెళ్ళిన 10 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బావిలో మునిగి మృతి చెందాడు. రాత్రి వరకు బాలుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బావి వద్దకు వెళ్ళి గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.