KRNL: ఆదోని పట్టణ శివారులోని ఇస్వీ కొండల్లో ఆదివారం పోలీసులు ఒక జూద స్థావరంపై దాడి చేశారు. ఎస్సై మహేష్ కుమార్ నేతృత్వంలోని బృందం 9 మంది జూదరులను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి రూ.17,000, 7 సెల్ ఫోన్లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. బోయ గోవిందరాజులు, బోయ పరశురాంలతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు.