E.G: గోకవరం మండలం కొత్తపల్లి మేజర్ పంచాయతీలో 10 రోజుల క్రితం నిర్మించిన డ్రైనేజీ అప్పుడే బీటలు వారడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పల్లె పండుగ 2.0’ పథకంలో భాగంగా గ్రామానికి కేటాయించిన రూ.70 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టారు. పనులలో నాణ్యత లోపించిందని అందుకే డ్రైన్లలో బీటలు వచ్చాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.