SDPT: భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా రాంసాగర్ రామాలయం నుంచి గోటి తలంబ్రాలు భద్రాచలానికి తరలించేందుకు సిద్ధం చేశారు. శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు సమకూర్చిన తలంబ్రాలను ఆదివారం రామరాజుకు అందజేశారు. భక్తితో సమర్పించిన ఈ తలంబ్రాలు రామయ్య సేవలో భాగం కావడం అదృష్టమన్నారు.