PPM: బలిజిపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 25న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వాణిశ్రీ తెలిపారు. ఎంపీపీ నాగమణి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని, సభ్యులంతా హాజరుకావాలని ఆమె కోరారు. సమావేశపు అజెండా నోటీసులను మండలస్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందస్తుగా తెలియజేసినట్లు వెల్లడించారు.