BDK: అశ్వారావుపేట నియోజకవర్గ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రేపటి నుంచి ఆర్థిక సహాయం అందనుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద నియోజకవర్గంలో మొత్తం 45,456 మంది రైతులు లబ్ధి పొందుతూ, సుమారు రూ.25.39 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.