AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో చదవడం నాకు ఇష్టం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రంధాలయాధికారి దమయంతి విద్యార్థులకు కథలు చదివించి, కెరీర్ మార్గదర్శక సూచనలు అందించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పీ. ప్రభాకర్ ప్రపంచ జల దినోత్సవ ప్రాముఖ్యత వివరించి, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. పజిల్, వినోదాత్మక ఆటలతో కార్యక్రమం ముగిసింది.