కోనసీమ: నీరు మనిషి జీవనానికి ప్రాణాధారమని, నీరు లేకుండా జీవనం అసాధ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా రామచంద్రపురంలో ఆదివారం మంత్రి రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.