కడప: నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారిని భారత క్రికెట్ క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీచరణి ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికి, పట్టు వస్త్రాలతో సన్మానించారు. చఆలయ నిర్వాహకులు సుధా దుర్గాప్రసాద్, వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు పాల్గొన్నారు. దేశానికి మరిన్ని విజయాలు సాధించాలని శ్రీచరణి ఆకాంక్షించారు.