TPT: తిరుపతిలో నిర్వహించిన దక్షిణ ప్రాంత ప్రాంతీయ కౌన్సిల్ సమావేశం, అడ్వకేసీ వర్క్షాప్లో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిని దేశంలో ప్రముఖ ల్యాండ్ మార్క్గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. వైద్య రంగంలో అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.