KMM: జిల్లాలో రూ.594 కోట్ల వ్యయంతో 100.82 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైరా-జగ్గయ్యపేట, మధిర, బోనకల్ వంటి కీలక మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. హ్యామ్ మోడల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపడి జిల్లా రూపురేఖలను మార్చేలా కీలక రహదారుల విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది.