KRNL: రోగులకు సీఎం సహాయనిధి పెద్ద భరోసా అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలో ఎంపీ బైరెడ్డి శబరి సిఫారసుతో మంజూరైన నిధులను ఇవాళ పంపిణీ చేశారు. వివిధ నియోజకవర్గాల నుంచి 22 మందికి మొత్తం రూ. 24.27 లక్షల చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.