NLG: నకిరేకల్ పట్టణంలో శ్రీ శాలిహవన చక్రవర్తి జయంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహానుభావుల ఆశయాలను స్మరించుకుంటూ.. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేతో పాటు శాలివాహన సంఘం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.