SDPT: ‘రైతు భరోసా పథకం’ కింద ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం తమ లక్ష్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నేటి నుంచి రైతుల ఖాతాల్లో చెల్లింపులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రూ.3,590 కోట్లతో లక్షలాది రైతులకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయ బలోపేతం, రైతు సంక్షేమం ప్రభుత్వ ప్రధాన కట్టుబాటుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.