WGL: ఓరుగల్లు ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయ రాజుల దూరదృష్టి భావితరాలకు ఎంతో ఉపయోగపడుతోందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. గణపతిదేవుడు, రుద్రదేవుడు, ప్రోలరాజు కాలంలో నిర్మించిన చెరువులు, గొలుసుకట్టలు నేటికీ ప్రాముఖ్యతను నిలుపుకున్నాయి. ముఖ్యంగా రామప్ప, లక్నవరం, పాకాల, గణపతి సముద్రం వంటి జలాశయాలు నేటికీ ప్రజల అవసరాలు తీరుస్తున్నాయని పేర్కొన్నారు.