GDWL: రాజోలి మండలంలోని పచ్చర్ల గ్రామంలో దస్తగిరయ్య ఉర్సు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం గ్రామ సర్పంచ్ బేబీ ఆధ్వర్యంలో ‘కిస్తీ’ వేడుకలను భక్తిశ్రద్ధతో నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించి కిస్తీ సమర్పించారు. గ్రామ పెద్దలు, భక్తులు భారీగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.