KMM: ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 10 రోజులే గడువు ఉండటంతో ఖమ్మం నగరపాలక సంస్థ (కేఎంసీ) పన్నుల వసూళ్లను వేగవంతం చేసింది. శనివారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులతో సమీక్ష నిర్వహించి అన్ని విభాగాల సిబ్బందిని వసూళ్ల ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాత బకాయిలను కూడా యుద్ధప్రాతిపదికన రాబట్టాలని అధికారులను ఆదేశించారు.