GDWL: గ్రామ అభివృద్ధికి సిమెంట్ రోడ్లు కీలకమని చాగదోన సర్పంచ్ జె.వీరేశ్ స్వామి అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టు మండలంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.10 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులకు శనివారం భూమిపూజ చేశారు. మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ పనుల నాణ్యతపై గుత్తేదారులకు సూచనలు చేశారు.