కోనసీమ: సఖినేటిపల్లి మండలం పల్లెపాలెం మత్స్యకారుల వలకు శనివారం రెండు అరుదైన ఆడ కచ్చిడి చేపలు చిక్కాయి. ఔషధాల తయారీలో వీటిని వినియోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. అయితే ఇవి ఆడ చేపలు కావడంతో ఆశించిన స్థాయిలో ధర రాదని, అదే మగ చేపలు అయితే భారీ ధర పలికేవని మత్స్యకారులు పేర్కొన్నారు. సముద్రంలో వేటకి వెళ్లిన సమయంలో ఈ చేపలు లభించాయని తెలిపారు.