PDPL: ఇటీవల గని ప్రమాదంలో గాయపడి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు లక్ష్మీనారాయణను సంస్థ CMO డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య బృందం చికిత్స వివరాలు సేకరించారు. వివరాలు కొత్తగూడెం ఆసుపత్రికి పంపించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ మేరకు బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.