NRPT: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రసన్నను కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, చికిత్సకు తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆపరేషన్ ఖర్చుల కోసం కూడా కృషి చేస్తానని తెలుపుతూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.