అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు బీజేపీ పార్టీలో చేరారు. శనివారం విశాఖలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. బీజేపీ ఆశయాలు సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు.