ELR: చాట్రాయి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి పార్థసారథికి వినతి పత్రం సమర్పించారు. ఇవాళ చాట్రాయిలో మంత్రిని టీడీపీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస్ కలిశారు. సుమారు 12 వేల ఎకరాల్లో పంట సాగులో ఉందని, త్వరగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరారు.