TG: రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రముఖ భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ HYD మెహదీపట్నం ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాడు. ప్రార్థనల అనంతరం సిరాజ్ తన స్నేహితులు, స్థానికులతో కలిసి పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. అభిమానులు ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సిరాజ్ అందరితో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశాడు.