TPT: టీటీడీ ప్రాణదాన ట్రస్ట్కు రూ. 10 లక్షల విరాళం అందజేసినట్లు జేఎంసీ ట్రస్ట్ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుమల రంగనాయకుల మండపంలో సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే, విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ సందర్భంగా సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.