KRNL: మద్దికేర సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్ అన్నారు. ఇవాళ వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని, అర్హులైన దివ్యాంగులు తమ పరిధిలో ఉన్న సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సదరం స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఈ నెల 30వ తేదీన ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేసుకోవచ్చని సూచించారు.