NZB: రంజాన్ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా శనివారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రధాని మోదీ అన్ని మతాల వారికి కేంద్ర పథకాలు అందే విధంగా చూస్తున్నారన్నారు.