అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం మైసూరవారిపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై ఇవాళ ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కడప వైపు వెళ్తున్న లారీ మార్కెట్ యార్డ్ సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. లారీ చెట్టుని ఢీకొని రోడ్డుకు అడ్డుగా ఉండటంతో కొంతమేర ట్రాఫిక్ జామైంది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.