కోనసీమ: ఆత్రేయపురం(M) వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటులు తనికెళ్ళ భరణి, గౌతం రాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. 25 సంవత్సరాలు క్రితం ఇక్కడికి రావడం జరిగిందని, అప్పుడు సాధారణ జనం, ఇప్పుడు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారన్నారు. మరో తిరుమలగా రోజూ రోజుకు అభివృద్ధి చెందుతుండడం సంతోషంగా ఉందన్నారు.