అనకాపల్లి జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) శనివారం బీజేపీలో చేరారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు 100 మందికి పైగా అనుచరులు పార్టీలో చేరారు. మోదీ నాయకత్వంపై ఆకర్షితులై ప్రజా సేవ కోసం చేరినట్లు ఎం.వి.ఆర్ తెలిపారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని మాధవ్ సూచించారు.