NRML: అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పాటునందించాలని కడెం మండలంలోని ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరెడ్డి కోరారు. అంతర్జాతీయ అడవుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉడుంపూర్ రేంజ్ పరిధిలో సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమస్త మానవాళికి అడవులు ఎంతో దోహదపడతాయని తెలిపారు.