MDK: చేగుంట మండలం బోనాల అమరుల స్తూపం వద్ద షహిద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి కరపత్రాన్ని రైతు కూలీ సంఘం ఆవిష్కరించింది. షహిద్ భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ల అమరత్వాన్ని 23న పల్లె పల్లెనా సామ్రాజ్యవాద అధర్మం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సభలు సమావేశాలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు బోనాల స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సూరంపల్లి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.