KKD: మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని, ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం కాకినాడలోని ఈద్గా మైదానం నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో కొండబాబు పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ సుభాకాంక్షలు తెలిపారు.