KMR: బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను శనివారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.