AKP: నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్కు ఈనెల 23న శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పండగ చేసుకోవాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక జడ్పీ అతిథి గృహంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కూటమి ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించేందుకు 50 బస్సులు కేటాయించినట్లు తెలిపారు.