MHBD: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమార్కులు ఇసుకను డంపు చేస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నర్సింహులపేట మండలంలోని లోక్యా తండా జీపీ పరిధిలోని మొక్కజొన్న చేనులో సుమారు 30 నుంచి 50 ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేశారు. ఈ ఇసుక దందా వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.