JGL: రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి రోగులను పరీక్షించారు. అనంతరం బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. దాదాపు 200 మంది శిబిరంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. సర్పంచ్ తలారి నాగమణి, ఉపసర్పంచ్ ప్రణయ్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.