NLG: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం దేవరకొండలోని ఈద్గా మైదానంలో నిర్వహించిన ఈద్-ఉల్-ఫితర్ సామూహిక ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్ ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి పాల్గొని ముస్లిం మత పెద్దలతో ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు.