TG: రాష్ట్ర ప్రజల పాలిట కాళేశ్వరం ప్రాజెక్ట్ వరం అని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటల దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని తెలిపారు. పంటలకు మద్ధతు ధర లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరారు.