MHBD: తొర్రూరు (M) లోని దుబ్బాతండా, కర్రె బిక్య తండాల్లో అంగన్వాడి కేంద్రాలు మూతపడడంతో చిన్నారుల పోషకాహార సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సరుకులు లబ్ధిదారులకు అందడం లేదు. అంగన్వాడీ సేవలు నిలిచిపోవడంతో బాలింతలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అంగన్వాడీలను పునఃప్రారంభించాలని కోరారు.