అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని ఈద్గా మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారు ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.