W.G: భీమవరం పట్టణంలోని పలు పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారి ఏ.ఎస్.రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రాల్లోని పాల నాణ్యతను పరిశీలించి, సేకరించిన నమూనాలను (శాంపిల్స్) పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ప్రయోగశాలకు పంపించినట్లు వెల్లడించారు.