సత్యసాయి: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మరణం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీర రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా కళ్యాణదుర్గం ప్రజా సేవలో ‘పెద్దాయన’గా పేరుగాంచిన ఆయన మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. భగవంతుడు మృతుని ఆత్మకు శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు సానుభూతి తెలియజేశారు.